మేము సైతం బాబు కోసం నినాదంతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి మీరు కొండ సతీష్ బాబు ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఏఎస్ రావు నగర్ డివిజన్ లో కొవ్వొత్తులతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా నీరుకొండ సతీష్ బాబు మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ని అక్రమ అరెస్ట్ చేసిన జగన్ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే దాకా నిరసన కార్యక్రమం కొనసాగుతుందన్నారు. దానిలో బాగంగా కొవ్వతుల ఎలిగించి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమం లో కాలనీ వాసులు వెంకటేష్, రవి, రంగ రాజు, శంకర్, బుచ్చిబాబు, శివ, రమేశ్, చంద్ర శేఖర్ , రాజు ,లక్ష్మీ, కరుణ, శివ కుమారి, విజయ లక్ష్మి, లక్కి తదితరులు పాల్గొన్నారు.
previous post