కరోనా వ్యాప్తి నిరోధానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తోందని, అందరూ ప్రభుత్వ సూచనలు పాటించాలని జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఇటలీ, అమెరికా పరిస్థితి మనకొద్దంటే స్వీయ నియంత్రణ పాటిస్తే మేలు అని ఆయన అన్నారు.
లాక్ డౌన్ ముగిసే దాకా ఇంటి నుండి బయటకు రావద్దని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రజలకు పిలుపునిచ్చారు. వెంగళ్ రావు నగర్ డివిజన్ లోని జవహర్ నగర్ లో కళ్యాణ్ నగర్ కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ స్వయంగా శానిటేషన్ చేసి ప్రజలకు కరోనా పై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక టిఆర్ఎస్ నాయకులు, డివిజన్ అధ్యక్షురాలు దేదీప్య వేణుగోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.