దేవరకొండ నియోజకవర్గంలోని చింతపల్లి మండలం తక్కల్లపల్లి గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 370 వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, గౌడ సోదరుల ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి గ్రామ యువ నాయకుడు ముద్దం రవీందర్ గౌడ్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ ముద్దం సత్యమ్మ మారయ్య గౌడ్, పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి జ్యోతి వెలిగించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
గ్రామ గీత పారిశ్రామిక సంఘం తరపున వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల విప్లవ వీరుడు ,ఆశా జ్యోతి సర్దార్ సర్వాయి పాపన్న అని, ఆయన తెలుగు జాతి కి చేసిన సేవలను కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని అన్నారు.
అదేవిధంగా ఆయన కాంస్య విగ్రహాన్ని ప్రభుత్వం గ్రామ గ్రామానe ఏర్పాటు చేయాలన్నారు. సర్వాయిపేటలోని గుట్ట, కోటలను పర్యాటక కేంద్రంగా మార్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పోతగోని రామస్వామి గౌడ్, శ్రీనయ్య ,వెంకటయ్య, పుల్లయ్య, ముద్దం పరమేష్ , మల్లేష్, యాదయ్య, రమేష్, సురేష్, నరసింహ, వెంకటయ్య, సాయి, శివ, సురేష్ గౌడ్, మాదగొని వెంకటయ్య,యాదయ్య,దూసరి పద్మయ్య, తదితరులు పాల్గొన్నారు.