ప్రముఖ సినీ నేపథ్య గాయని సునీలకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమె తన ఫేస్ బుక్ ఖాతా నుంచి వెల్లడించారు. అంతే కాకుండా తనకు ఏ విధంగా కరోనా సోకిందో కూడా అందులో వివరించింది.
ఒక కార్యక్రమానికి వెళ్లినపుడు తనకు కరోనా సోకిందని సునీత తెలిపారు. కార్యక్రమం నుంచి వచ్చిన తర్వాత తల నొప్పి రావడంతో ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నానని అందులో కరోనా పాజిటీవ్ గా నిర్ధారణ అయిందని సునీత చెప్పారు. ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉండి డాక్టర్ల సూచన మేరకు చికిత్స తీసుకుంటున్నారు.
మరో వైపు టాలీవుడ్ ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాబారిన పడి కోలుకుంటున్నారు. అదే విధంగా బండ్ల గణేష్, రాజమౌళి, డీవీవీ దానయ్య, తేజ, నాగవంశీ మరికొంత మంది ప్రముఖులు కరోనా బారిన పడి కోలుకున్నారు. ఇప్పుడు సింగర్స్ సునీత, మాళవికకు పాజిటివ్ రావడం అందరు ఆందోళన చెందుతున్నారు.