సర్దార్ వల్లభభాయి పటేల్ సేవలు చిరస్మరణీయమని, దేశాన్ని సమైక్యంగా నిలబెట్టిన మహనీయుడు సర్దార్ వల్లభభాయి పటేల్ అని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. మంగళవారం ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రామంతపూర్ హోమియోపతి కాలేజ్ ఎదురుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, హబ్సిగూడ డివిజన్ కార్పొరేటర్ జిహెచ్ఎంసి ఫ్లోర్ సెక్రెటరీ కక్కిరేని చేతన హరీష్, రామంతపూర్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకటరావు, హబ్సిగూడ డివిజన్ అధ్యక్షుడు కక్కిరేణి హరీష్ లతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ తన కృషితో, రాజనీతిజ్ఞతతో, దాదాపు 560 రాజ్య సంస్థానాలను స్వతంత్ర భారతంలో విలీనం చేసి, దేశాన్ని సమైక్యంగా నిలబెట్టిన మహనీయుడు సర్దార్ వల్లభభాయి పటేల్ అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ దేవసాని బాలచందర్, మాజీ కౌన్సిలర్ చింతోజు శ్రీనివాసాచారి, వేములకొండ సోమశేఖర్ గౌడ్ ,సంజయ్ పటేల్ ,జిల్లెల రవీందర్ రెడ్డి, రఘుపతి, వేములకొండ వెంకన్న గౌడ్, రాఘవరెడ్డి,ప్రధాన కార్యదర్శిలు చెల్లోజు ఎల్లాచారి, చింతకింది ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా