40.2 C
Hyderabad
May 5, 2024 18: 05 PM
Slider ముఖ్యంశాలు

నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

#bandari

నాయి బ్రాహ్మణులకు ఉచితంగా కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని ఉప్పల్  బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఉప్పల్ నియోజకవర్గం రామంతపూర్ డివిజన్ సాయి కృష్ణ కాలనీలో నాయి బ్రాహ్మణుల సంక్షేమ సంఘం భవన్ లో ఏర్పాటుచేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా బండారి లక్ష్మారెడ్డి హాజరైనారు. ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ  ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డి  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్  రాష్ట్రంలో నీ నాయి బ్రాహ్మణుల  సంక్షేమానికి ఉచితంగా కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని అన్నారు.

తద్వారా వారికి ఎంతో లాభం చేకూరుతుందని అలాగే వారికి బీసీ బందు , డబల్ బెడ్రూంలో ఇల్లు కేటాయింపులో తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని బండారి లక్ష్మారెడ్డి  ఒక ప్రకటనలో తెలియజేశారు. అనంతరం నాయి సంక్షేమ సంఘం అధ్యక్షులు బాలయ్య, ప్రధాన కార్యదర్శి లింగం, కోశాధికారి రమేష్, నరేష్ ,మధు, ఏర్పాటు చేసిన సమావేశంలో నాయి బ్రాహ్మణులందరూ ఉప్పల్ నియోజకవర్గం బిఆర్ఎస్  ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి కి, తమ పూర్తి మద్దతు ఉంటుందని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్  గొల్లూరు అంజయ్య , బిఆర్ఎస్ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి , గంధం నాగేశ్వర్రావు, బాబు యాదవ్, ముస్తాక్ నాయి బ్రాహ్మణుల సంక్షేమ సంఘం సభ్యులు, ఉద్యమకారులు, నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా  

Related posts

దళిత మహిళపై దాడి ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ

Satyam NEWS

బక్కోడి చేతికి బందుకు పట్టించిన సాయుధ పోరాటం

Satyam NEWS

బాంబ్ మేకర్:ఆదిత్యరావు లాకర్ లో సైనైడ్

Satyam NEWS

Leave a Comment