39.2 C
Hyderabad
May 3, 2024 13: 01 PM
Slider విజయనగరం

ఎం.ఎస్.సీ.డీ కెమారాలతో విజయనగరం శ్రీశ్రీ శ్రీ పైడితల్లి సిరిమానోత్సవం

#sirimanu

అందరి సహకారంతో ప్రశాంతంగా ముగిసిందన్న పోలీసు బాస్

విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం కన్నుల పండుగగా  ముగిసింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుశాఖ చేపట్టిన పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు, ముందస్తు భద్రత, జాగ్రత్త చర్యలు సత్ఫలితాలిచ్చాయి. సిరిమాను వెంబడి జిల్లా ఎస్పీ ఎం.దీపిక తిరిగి, బందోబస్తు ఏర్పాట్లును స్వయంగా పర్యవేక్షించారు. సిరిమానోత్సవం ముగిసిన తరువాత భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రధాన కూడళ్ళులో బ్యారికేడ్లును ఒక క్రమ పద్ధతిలో తొలగించి, వారు అన్ని మార్గాలలో వెళ్ళేందుకు అనుమతించారు.

పోలీసుశాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలీసు సేవాదళ్ దివ్యాంగులు, వృద్ధులు, గర్భిణిలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండాకు విశేషమైన సేవలందించి, ప్రజల మన్ననలు పొందింది. సిరిమానోత్సవం అనంతరం సిబ్బంది విధుల నుండి వెళ్ళిపోకుండా పోలీసు అధికారులు చర్యలు చేపట్టి, తమకు కేటాయించిన స్థానం వద్దనే ట్రాఫిక్ రెగ్యులేషన్ కు ప్రత్యేక చర్యలను పోలీసుశాఖ చేపట్టడం కూడా సత్ఫలితాలిచ్చింది.

సిరిమానోత్సవం సజావుగా, ప్రశాంత వాతావరణంలో ముగియుటకు అన్ని వర్గాల ప్రజల తమ వంతు సహకారాన్ని పోలీసుశాఖకు అందించారని జిల్లా ఎస్పీ ఎం.దీపిక అన్నారు. విద్యుత్, అటవీ, ఆరోగ్య, మున్సిపల్, ఫైర్, రెవెన్యూ, దేవాదాయ మరియు ఇతర శాఖలు సమన్వయంతో పని చేసాయన్నారు. అదే విధంగా ప్రజలు, పాత్రికేయులు, ఇతర జిల్లాల నుండి వచ్చిన పోలీసు అధికారులు, సిబ్బంది తమ వంతు సహకారాన్ని పోలీసుశాఖకు అందించారని, వారందరికి జిల్లా ఎస్పీ ఎం.దీపిక ధన్యవాదాలు తెలిపారు.

ఎటువంటి దొంగతనాలు జరగకుండా భక్తులను పోలీసు కంట్రోల్ రూం నుండి సిసి కెమెరాలను పరిశీలిస్తూ, ఎప్పటికప్పుడు సంబంధిత పోలీసు అధికారులను అప్రమత్తం చేయడం, మఫ్టీలో పోలీసులు పహారా కాయడం, అనుమానితుల వ్రేలి ముద్రలను ఎం.ఎస్.సి.డి., పరికరాలతో చెక్ చేసి, వారు పాత నేరస్థులా? కాదా? అన్న విషయం నిర్ధారణ కావడంతో ఎటువంటి దొంగతనాలు జరగలేదు.

అన్ని ముఖ్య కూడళ్ళులో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలను తాత్కాలిక ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం చేయడంతో సిసి ఫుటేజులను కమాండ్ కంట్రోల్ నుండే జిల్లా ఎస్పీ ఎం. దీపిక, అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్, పార్వతీపురం అదనపు ఎస్పీ ఓ. దిలీప్ కిరణ్ పర్యవేక్షించారు. సిసి కెమెరాల ఫుటేజులు పరిశీలించి, రద్దీని బట్టి, మార్గాలను మళ్ళించడం జరిగింది.

అదనపు ఎస్పీలు అస్మా ఫర్హీన్, ఓ. దిలీప్ కిరణ్, డిఎస్పీలు ఆర్. గోవిందరావు, పి.శ్రీధర్, ఎ.ఎస్.చక్రవర్తి, ఆర్.శ్రీనివాసరావు, వీరకుమార్, వివి అప్పారావు, టి.త్రినాధ్, బాల చంద్రారెడ్డి, మురళి, ఎల్. మోహన రావు, యూనివర్స్ బందోబస్తును పర్యవేక్షించి ఆయా ప్రాంతాలలో విధులు నిర్వహించే పోలీసు అధికారులను అప్రమత్తం చేయడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడగలిగామని, పోలీసుశాఖకు సహకరించిన జిల్లా ప్రజానీకానికి ఎస్పీ ఎం.దీపిక కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

కెసిఆర్ మనవనికి రేషన్ బియ్యం పెడతారా..?

Satyam NEWS

ఈ ఫొటోలో ఉన్న కాయ ఏమిటో చెప్పగలరా?

Satyam NEWS

స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంపై రాష్ట్రపతికి చంద్రబాబు ఫిర్యాదు

Satyam NEWS

Leave a Comment