బహుజన విప్లవ వీరుడు సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ 371వ,జయంతి వేడుకలను సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని గౌడ యువజన సంఘం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు.
హుజూర్ నగర్ పట్టణం లోని మటన్ మార్కెట్ సెంటర్ లో సర్ధార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను గౌడ కులపెద్దలు బెల్లంకొండ చిరంజీవి గౌడ్,తండు ఉపేందర్ గౌడ్ లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాజీ మున్సిపల్ ఛైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్,ఐ ఎన్ టి యు సి ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్,మాజీ ఎంపిపి నర్సింగ్ వెంకటేశ్వర్లు గౌడ్,గౌడ యువజన సంఘం అధ్యక్షుడు బెల్లంకొండ అమర్ గౌడ్,పిఏసిఎస్ ఛైర్మన్ యరగాని శ్రీనివాస్ గౌడ్,గీత కార్మిక సొసైటీ అధ్యక్షుడు వల్లపుదాసు కృష్ణ,కౌన్సిలర్ యరగాని గురవయ్య గౌడ్ పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి,కేక్ కట్ చేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం సర్వాయి పాపన్న జయంతి వేడుకల నిర్వాహకులు పండ్ల హుస్సేన్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సభలో పలువురు గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ అణగారిన బహుజన గౌడ జాతిలో జన్మించి మొగలులకు వ్యతిరేకంగా గోల్కొండ ఖిల్లాపై జెండాను ఎగరవేసిన పాపన్న గౌడ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత కృషి చేయాలని అన్నారు.
సామాన్య గౌడకులం నుండి బహుజన వర్గాల ఆత్మవిశ్వాస ప్రతీకగా ఎదిగిన పాపన్న జయంతి వేడుకులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.గౌడ సోదరులంత రాజ్యాధికారం లక్ష్యంగా పయనించాలని పిలుపునిచ్చారు.పట్టణం లోని తమ స్వంత ఖర్చులతో సర్ధార్ సర్వాయి పాపన్న విగ్రహన్ని ఏర్పాటకు సహకరించనున్నట్లు తండు సాయిరాం గౌడ్,తండు ప్రసాద్ గౌడ్ లు ప్రకటించారు.అదే విధంగా తమ తండ్రి కీ.శే తండు వెంకటనర్సు గౌడ్ జ్ఞాపకార్ధం కుమారులు తండు రామకృష్ణ గౌడ్, తండు హరికృష్ణ గౌడ్ లు లింగగిరి రోడ్ లోని కంఠమహేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి 5 లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపారు.
చివరగా రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు దొంతగాని సత్యనారాయణ గౌడ్ కళా బృందం చేసిన నృత్యాలు పలువురిని అకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో గౌడ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి తండు సాయిరాం గౌడ్,పండ్ల హుస్సేన్ గౌడ్,దొంతగాని రాజారమేష్ గౌడ్,పులిగోవింద్ గౌడ్,కుక్కడపు నర్సింహారావు గౌడ్,యలక సైదులు గౌడ్,తండు హరిక్రిష్ణ గౌడ్,వట్టికూటి జంగమయ్య గౌడ్,అయిల వెంకన్న గౌడ్,యరగాని సత్యనారాయణ గౌడ్,కోల శ్రీనివాస్ గౌడ్,బత్తిని మల్లయ్య గౌడ్,దొంతగాని బుచ్చిబాబు గౌడ్,కోల మట్టయ్య గౌడ్,వెంకటేశ్వర్లు గౌడ్, బెల్లంకొడ శ్రీనివాస్,సోమగాని వీరన్న గౌడ్,చెనగాని బాలకృష్ణ,వల్లపుదాసు గోపి గౌడ్,దొంతగాని సతీష్ గౌడ్,నర్సింగ్ సతీష్ గౌడ్,దొంతగాని పెద్ద శ్రీనివాస్ గౌడ్,బత్తిని ప్రసాద్ గౌడ్,కుక్కడపు మహేష్ గౌడ్,వల్లపుదాసు శేఖర్,బత్తిని కృష్ణ గౌడ్,తండు గోపి గౌడ్ ,నక్కరవి,బంటు సైదులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్