అమరావతిలో భూసేకరణపై హైకోర్టులో రాజధాని రైతులు పిటిషన్ లు దాఖలు చేశారు. భూములను మూడేళ్లలో అభివృద్ధి చేసి ఇవ్వలేదని 7 పిటిషన్లు రాజధాని రైతులు దాఖలు చేశారు. CRDA వల్ల ఆదాయం కోల్పోయామని పిటిషనర్ల తరపు లాయర్ వాదన వినిపించారు.
రెసిడెన్షియల్, కమర్షియల్ ఫ్లాట్ యజమానులకు పరిహారం ఇవ్వాలని పిటిషన్ లో రాజధాని రైతులు కోరారు. దాంతో కౌంటర్ దాఖలు చేయాలని CRDA కు హైకోర్టు ఆదేశం జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 24వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.