పాములపర్తి వెంకట నరసింహారావు
తెలంగాణ నేల నోచిన నోము ఫలం
వరంగల్లు జిల్లా నర్సంపేట మండలం
లక్నెపల్లి గ్రామంలో పురుడు పోసుకుని
వంగర గ్రామ వాసి పాములపర్తి వెంకట సీతారామారావు దంపతులకు
దత్త పుత్రుడై నాగపూర్ విశ్వ విద్యాలయం నుండి లా పట్టా పొంది రాజకీయాలలో రాటు తేలి
ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రియై
భారత దేశ ప్రదాన మంత్రి పదవిని
చేతబూనిన తొలి తెలుగు వాడై
గురుకుల ఆశ్రమ, నవోదయ విద్యా లయాలకు నాంది పలికి
గాడి తప్పిన దేశ ఆర్థిక వ్యవస్థలో
విప్లవాత్మక సంస్కరణలను ఉదయింపచేసి,
తెలుగు అకాడమీ స్థాపకుడై, వేయి పడగలు పుస్తకాన్ని సహస్రఫట్ గా
హిందీ బాషలోకి అనువదించిన గొప్ప
సాహితీవేత్త, మహా మేధావి, స్థితప్రజ్ఞుడు, నిరాడంబరత, నిజాయితీ కలిగిన ధీరోదాత్తుడు పి. వి.
దేశ చరిత్రలో కలకాలం నిలిచి పోయిన తెలంగాణ తేజం
జయాకర్ రాపోలు, నల్లగొండ, చరవాణి: 9963581382