బిచ్కుంద మండలంలోని పుల్కల్ గ్రామంలో గల పెద్ద చెరువు నుండి రెండవ పంట యాసంగి కొరకు నీటిని మండల వైస్ఎంపిపి రాజు పటేల్ ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగి 360ఎకరాల ఆయకట్టు సాగవుతుందని రైతులు నీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఆయకట్టు కింద ఉన్న ప్రతి రైతుకు నీరు అందేలా ఒకరినొకరు సహకరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి తోపాటు సర్పంచ్ విజయలక్ష్మి భూమి శెట్టి, మాజీ సర్పంచ్ పె౦ట్రామ్, గ్రామ పెద్దలు గన్న వీరన్న, భూమి శెట్టి, వార్డు సభ్యులు సంతోష్ సలీం గ్రామ రైతులు పాల్గొన్నారు.