33.7 C
Hyderabad
April 28, 2024 23: 29 PM
Slider ముఖ్యంశాలు

ఫిబ్రవరి లో పోడు పట్టాల పంపిణీ

#video conference

పోడు భూముల పట్టాలను అర్హులకు పంపిణీ ఫిబ్రవరి నెలలో జరిగేలా అధికారులు సన్నద్దం చేయాలని  రాష్ట్ర స్త్రీ- శిశు సంక్షేమం, గిరిజన అభివృద్ధి శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, రాష్ట్ర స్థాయి ఉన్నతస్థాయి అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో పోడు భూములు, కంటి వెలుగు, మన ఊరు మన బడి, పామ్ ఆయిల్ సాగు,  ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు, జి.ఓ. 58, 59, ఐడిఒసి లపై వీడియో సమావేశం ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ, పోడు భూముల సమస్యకు సంబంధించి సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని, ఇప్పటికే క్షేత్ర స్థాయిలో వంద శాతం సర్వే, గ్రామ సభలు పూర్తి చేసామని అన్నారు. ఫిబ్రవరిలో పోడు భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్వహించడం జరుగుతుందని, దీనికి అవసరమైన చర్యలు అధికారులు పూర్తి చేయాలని మంత్రి సూచించారు. అడవులను సంరక్షిస్తూనే, చట్టానికి లోబడి సాగు చేస్తున్న గిరిజన, గిరిజనేతర రైతులకు పోడు భూముల పట్టాలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.  జిల్లాల వారీగా మరొకమారు సమీక్షించుకుని అర్హులైన ప్రతి ఒక్కరికి  న్యాయం చేయాలని తెలిపారు.   

ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ, పెద్ద ఎత్తున చర్చ జరిగి సబ్ కమిటీ ఏర్పాటు చేసి సమస్యను కొలిక్కి తీసుకొని రావడం జరిగిందని అన్నారు. పోడు భూముల పట్టాల పంపిణీ అనంతరం మరో ఇంచ్ భూమి కూడా ఆక్రమణకు గురి కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ లకు ఆయన సూచించారు. గ్రామాలలో ప్రజాప్రతినిధులు, అన్ని పక్షాల ప్రతినిథులతో తదుపరి గ్రామాలో అటవీ సంరక్షణకు కట్టుబడి ఉండేలా, తదుపరి ఆక్రమణ కాకుండా తీర్మానం చేయాలని ఆయన తెలిపారు.  

ప్రభుత్వ మార్గదర్శకాలను తూ.చ. తప్పకుండా పాటిoఛాలి

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, ప్రభుత్వ మార్గదర్శకాలను తూ.చ. తప్పకుండా పాటిస్తూ అర్హులందరికీ పోడు పట్టాల పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ లకు సూచించారు.  జిల్లా కలెక్టర్ లకు సంబంధించిన డి.ఎల్.సి. మాడ్యుల్స్ ఈ రోజు నుండి అందుబాటులోకి వస్తాయని, రెండు రోజుల్లో ఎస్.డి‌.ఎల్.సి. నుంచి వచ్చిన దరఖాస్తుల పై తుది నిర్ణయం తీసుకోవాలని సిఎస్ ఆదేశించారు. గ్రామ సభల తీర్మానాలు, ఎస్.డి.ఎల్.సి. మధ్య ఉన్న గ్యాప్ పై జిల్లాలో కలెక్టర్ లు సమీక్షించాలని, గిరిజనులకు సంబంధించి చట్టం ప్రకారం రెండు ఆధారాలు ఉంటే తప్పనిసరిగా ఆమోదించాలని సీఎస్ పేర్కొన్నారు.  పోడు భూముల పట్టాల కోసం వచ్చిన దరఖాస్తు తిరస్కరించే పక్షంలో దానికి గల కారణాలను స్పష్టంగా తెలియజేయాలని సీఎస్ అన్నారు.  జిల్లాలో కలెక్టర్ లు ముందస్తుగా ఎస్.డి.ఎల్.సి పూర్తి చేసిన దరఖాస్తులను ఆమోదించి ఫిబ్రవరి 6 నాటికి పోడు భూముల పట్టాలు ప్రింటింగ్ పూర్తి చేసి ముఖ్యమంత్రి నిర్ణయించే తేది నుండి పంపిణీ కోసం సన్నద్ధంగా ఉండాలని సీఎస్ ఆదేశించారు. ప్రజల దశాబ్దాల కలను ప్రభుత్వం సాకారం చేస్తూ పట్టాలు పంపిణీ చేస్తుందని, జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ది చేకూరాలని, ఎస్.డి.ఎల్.సి హోల్డ్ లో పెట్టిన దరఖాస్తులు, తిరస్కరించిన దరఖాస్తులను కలెక్టర్ లు మరోమారు పరిశీలించి  మార్గదర్శకాల ప్రకారం రెండు ఆధారాలు ఉంటే ఆమోదించాలని సీఎస్ ఆదేశించారు. అనంతరం  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంటి వెలుగు, టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ, మన ఊరు- మన బడి, ఆయిల్ పామ్ సాగు అంశాల పై కలెక్టర్ లతో సీఎస్ చర్చించారు.  కంటి వెలుగు శిబిరాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 12,81,774 మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 2.94 లక్షల మంది రీడింగ్ కళ్ళద్దాలు పంపిణీ చేశామని, 2.05 లక్షల మంది ప్రజలకు ప్రిస్క్రిప్షన్ కళ్ళద్దాల ఆర్డర్ చేశామని అన్నారు.  జిల్లాలో ఉన్న క్వాలిటీ కంట్రోల్ బృందాలు విస్తృతంగా పర్యటించాలని, వారి ఫీడ్ బ్యాక్ తీసుకుని కలెక్టర్ లు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. రాష్ట్రంలో చేపట్టిన టీచర్ల బదిలీలు పదోన్నతుల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరిగే విధంగా కలెక్టర్ లు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, జిల్లాలో ఉపాధ్యాయుల నుంచి అభ్యంతరాలు, ఫిర్యాదు స్వీకరణకు గ్రీవెన్స్ విభాగం ఏర్పాటు చేయాలని సీఎస్ సూచించారు. జిల్లాలో ఉపాధ్యాయులు కోసం ప్రత్యేకంగా మెడికల్ బోర్డు, సదరం క్యాంపు ఏర్పాటు చేయాలని అన్నారు.

Related posts

ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయందే కీలక పాత్ర

Satyam NEWS

దిశ జాగృతి యాత్ర‌లో మహిళా సంర‌క్ష‌క పోలీసుల‌దే కీల‌క పాత్ర‌

Satyam NEWS

పోలీసులు చేసిన సేవ ఏంటో…కేంద్రానికి చెప్పిన క‌రోనా మ‌హిళా వారియ‌ర్

Satyam NEWS

Leave a Comment