40.2 C
Hyderabad
May 6, 2024 15: 05 PM
Slider నల్గొండ

స్వీయ జాగ్రత్తలు పాటిస్తూ, మనో ధైర్యంగా ఉండాలి

#MLASaidireddy

కరోనా బాధితులందరూ స్వీయ జాగ్రత్తలు పాటిస్తూ, మనోధైర్యంతో ఉండాలని  హుజూర్ నగర్ నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి  అన్నారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలం పెదవీడు గ్రామంలో కరోనా బాధితుల కొరకు ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాన్ని సైదిరెడ్డి సందర్శించి,మౌలిక వసతులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు.

కరోనా నియమాలను అనుసరించి నడుచుకోవాలని, భౌతిక దూరం పాటిస్తూ మాస్క్ లు ధరించాలని, అత్యంత అవసరమైతే తప్ప బయిటకు రావద్దని అన్నారు.

ఈ కార్యక్రమంలో MPP కొండా నాయక్, టి‌ఆర్‌ఎస్ నాయకులు బ్రహ్మారెడ్డి, సర్పంచ్ బీబీ కుతుబ్,  MPTC  వెంకట్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు సుబ్బయ్య నాయుడు, నాగరాజు, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కాలి పట్టీ పోవటంతో బాలిక ఆత్మహత్య

Sub Editor

హెచ్.సి.యు యూనివర్సిటీ లీజును  పొడిగించాలి

Satyam NEWS

ఒకేసారి 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించిన సీఎం జగన్

Bhavani

Leave a Comment