ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో సర్వర్ చారిటబుల్ ట్రస్ట్ &ఫౌండేషన్ ఆధ్వర్యంలో పండ్ల పంపణీ చేశారు.
కమ్యూనిస్టు నేత యం.డి సర్వర్ 71వ జయంతిని పురస్కరించుకొని ములుగు జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
అనంతరం ట్రస్ట్ & పౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ సర్వర్ సమాజ శ్రేయస్సు కోసం ఎంతో కృషి చేశారని అన్నారు.
పేద ప్రజలకు సర్వర్ చారిటబుల్ ట్రస్ట్ & ఫౌండేషన్ అండగా ఉంటుందని, మునుముందు సర్వర్ చారిటబుల్ ట్రస్ట్ & ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరిండెంట్ జగదీష్, సిబ్బంది, ట్రస్ట్ & పౌండేషన్ సభ్యులు మామిడి పెల్లి రమేష్,రాసమల్ల హేమంత్,చంటి సామ్యూల్, అత్తిని శ్రీకాంత్,బోల్లవేన రాజ్ కుమార్,బుర్ర రత్నాకర్,శ్రీను ఆస్పత్రి సిబ్బంది ఉన్నారు.