నిజామాబాద్ జిల్లా సర్పంచ్ ల ఫోరం ప్రతినిధులు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ను హైదరాబాద్ లోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు.
గత ఆరేండ్లుగా గ్రామాల అభివృద్ధికి నిరంతరం పాటుపడుతూ, సర్పంచ్ లకు అండగా నిలుస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ సందర్భంగా సర్పంచ్ లు కృతజ్ఞతలు తెలిపారు.
సర్పంచ్లు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారంతో పాటు గ్రామాభివృద్ధికి పాటు పడాలన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.
సర్పంచ్ లు పలు వినతులను ప్రస్తావించగా, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారు.
సర్పంచ్ ల ఫోరం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అసోల్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి యెడ్ల రాజేశ్వర్ రెడ్డి, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు