33.7 C
Hyderabad
April 29, 2024 01: 39 AM
Slider ముఖ్యంశాలు

డిల్లీ లో 17 నుండి ప్రత్యేక కార్యక్రమాలు

#anmaravathi

ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన చేసి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా దిల్లీలో నిరసన తెలపాలని అమరావతి పరిరక్షణ సమితి నిర్ణయించింది.  డిసెంబరు 17, 18, 19 తేదీల్లో దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వేదికగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు శివారెడ్డి, కార్యదర్శి గద్దె తిరుపతిరావు ప్రకటించారు. ధరణి కోట నుంచి ఎర్రకోట వరకు నిరసన యాత్ర ఉంటుందని అమరావతి ఐకాస నేతలు తెలిపారు. 1800 మందితో ప్రత్యేక రైలులో రాజధాని ప్రాంత రైతులు దిల్లీ వెళ్తారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలని నేతలు డిమాండ్‌ చేశారు.  17 జంతర్‌ మంతర్‌లో ధర్నా చేపడతామని.. 18న ఇతర రాష్ట్రాల ఎంపీలను కలవనున్నట్లు వివరించారు. 19న రామ్‌లీలా మైదానంలో జరిగే కిసాన్‌ సంఘ్‌లో పాల్గొంటామని తెలిపారు.

Related posts

బాధిత కుటుంబానికి చేయూతనందించిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

Satyam NEWS

తాజా హెచ్చరికలతో ఉక్రెయిన్ లో పెరిగిన ఆందోళన

Satyam NEWS

చంద్రగ్రహణం కారణంగా టిటిడి స్థానిక ఆలయాల మూత

Bhavani

Leave a Comment