అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో హిందూ,ముస్లిం,క్రిస్టియన్ స్మశాన వాటికలకు స్థలం కేటాయింపు స్థల పత్రాలు ఆయా వారి మతపెద్దలకు వైసీపీ నేతలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి, జడ్పీ ఛైర్మన్ అకేపాటి అమరనాధ రెడ్డి,మునిసిపల్ చైర్మన్ పొలా శ్రీనివాసులు రెడ్డి తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.రాజంపేట శాసనసభ్యులు మేడా వెంకట మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ రాజంపేట పట్టణంలో స్మశాన వాటికల విషయమై ఇబ్బందిగా ఉండడంతో గతంలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి,జిల్లా పరిషత్ చైర్మన్ అకేపాటి అమర్నాథ్ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ పోలె శ్రీనివాసులు రెడ్డి, అయన స్మశాన వాటికల విషయమై హిందూ,ముస్లిం, క్రిస్టియన్ స్మశాన వాటికలకు స్థలం కేటాయించాలని గతంలో కలెక్టర్ తో ఆర్డీఓతో మాట్లాడామని తెలిపారు.
ఈరోజు స్మశాన వాటికల స్థలాలకు కలెక్టర్ గారు ప్రొసీడింగ్స్ ను పంపించడం జరిగిందని ఇచ్చిన మాటకు కట్టుబడి హిందూ స్మశాన వాటికకు ఐదు ఎకరాలు , ముస్లిం స్మశాన వాటికకు నాలుగు ఎకరాలు క్రిస్టియన్స్ కమ్యూనిటీకి మూడు ఎకరాలు స్మశాన వాటికల స్థల ప్రొసీడింగ్స్ ను ఆయా వారి మత పెద్దలకు అంద జేస్తామని,కుల మతాలకతీతంగా పనిచేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా అందరికీ సమానంగా ఉండాలని ఒక పద్ధతి ప్రకారం ఈ విధంగా కలిసి ఏర్పాటు చేయడం జరిగిందని రాజంపేట శాసనసభ్యులు మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి తెలిపారుఅనంతరం నేడు ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో జడ్పీ చైర్మన్ మరియు రాజంపేట మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులు రెడ్డి వైస్ చైర్మన్లు మరియు కౌన్సిలర్లు కేక్ కట్ చేసి శాలువతో సన్మానించారు.ఈ కార్యక్ర మంలో హిందూ, ముస్లిం,క్రిస్టియన్ మత పెద్దలు, వైఎస్ఆర్సిపి పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.