38.2 C
Hyderabad
May 3, 2024 19: 24 PM
Slider వరంగల్

వరంగల్ జిల్లా కేంద్రంలో రౌడీ షీటర్ దారుణ హత్య

#brutally murdered

వరంగల్ జిల్లా కేంద్రంలోని శివనగర్ కు చెందిన రౌడీషీటర్ నజీర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఉత్తరప్రదేశ్ చెందిన నలుగురు ఇనుప రాడ్లతో తలపై కొట్టడంతో రక్తస్రావమై అక్కడిక్కడే మృతి చెందాడు. వరంగల్ రైల్వే స్టేషన్ సెకండ్ ప్లాట్ ఫారం వైపు ఉన్న బార్ షాప్ వద్ద అర్ధరాత్రి నజీర్ ను కొట్టి చంపారు. నజీర్ చనిపోయాడని నిర్ధారించుకొన్న ఉత్తరప్రదేశ్ కు చెందిన నలుగురు పారి పోయారు.

అర్ధరాత్రి ప్రాంతంలో మద్యం మత్తులో ప్రారంభమైన గొడవ పెరిగి పెద్దదిగా మారినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బ‌తుకు దేరువు కోసం ఉత్తరప్రదేశ్ నుండి వచ్చిన వారు శివనగర్ కు చెందిన లోకల్ పర్సన్ ను మర్డర్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

బతుకు దేరువు కోసం వచ్చిన ఉత్తరప్రదేశ్ చెందిన వారికి ట్రైన్స్ లో కీ చైన్స్ లాంటి చిరు వ్యాపార నిమిత్తం నజీర్ డబ్బులను అప్పుగా ఇస్తూ వసూళ్లు చేసుకొంటారు. కొంతకాలం నుండి డబ్బులివ్వకుండా తప్పించుకు తిరుగుతున్న వారిని పట్టుకొని నిలదీయడంతో మాటమాట పెరిగి హత్యకు దారితీసిన్నట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మిల్స్ కాలనీ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

కరీంనగర్‌లో భారీ అగ్నిప్రమాదం

Satyam NEWS

ఆనందయ్య మందు: జగన్ ప్రభుత్వంపై ఏపి హైకోర్టు ఆగ్రహం

Satyam NEWS

రేపటి నుంచి ఆలయాల్లో ఆర్జిత సేవలు, పూజలు

Satyam NEWS

Leave a Comment