సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని దద్దనాల చెఱువు 1వ, వార్డులో నల్లగొండ పార్లమెంటు సభ్యుడు కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో బి.ఆర్.యస్ పార్టీకి చెందిన పలువురు ఆ పార్టీకి రాజీనామా చేసి 200 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ వీడిన వారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి మూడు రంగుల కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు.ముందుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటి నుండి ద్విచక్ర వాహనాలతో బాణాసంచా కాల్చూతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ర్యాలీగా గణపతి ఆలయంకు చేరుకున్నారు.అక్కడ మహిళలు యం.పి ఉత్తమ్ కు నుదుట తిలకం దిద్ది,హారతి పట్టి,పూలు చల్లుతూ ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం గణపతి ఆలయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్