శ్రీకాకుళం జిల్లా అదపాక గ్రామ అగ్ని ప్రమాద బాధితులకు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.గోవిందరావు, జిల్లా నాయుకులు సి.హెచ్.అమ్మన్నాయుడు, ఎన్.వి.రమణ చేతులు మీదుగా రెండు క్వింటాలు బియ్యం, చీరలు, లుంగీలు పంపిణీ చేసారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లావేరు మండలం అదపాక గ్రామంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో 19 కుటుంబాలకు చెందిన ఇళ్ళు దగ్ధమవడంతో సర్వం కాలిబూడిదయ్యిందని ఆవేదన వ్యక్తం చేసారు.
వీరికి ప్రభుత్వం పక్కా ఇళ్ళు కట్టించి ఇవ్వాలని, అన్నివిధాలా ఆదుకోవాలని డిమాండ్ చేసారు. ఆపదలో ఉన్న తమకు సిఐటియు ఆధ్వర్యంలో సహాయం చేసినందుకు అగ్నిప్రమాద బాధితులు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ నాయకులు గొంటి.గిరిధర్, సిఐటియు లావేరు మండల కార్యదర్శి మీసాల. గౌరిశంకర్, శ్యాం క్రగ్ పిస్టన్స్ & రింగ్స్ స్టాఫ్ &వర్కర్స్ యూనియన్(సిఐటియు) ప్లాంట్-3 నాయకులు పి.దుర్గాప్రసాద్, మీసాల.సూర్యనారాయణ, గొర్లె. నాగభూషణం, ఎమ్.అశోక్, ఎస్.దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.