డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైయస్ షర్మిల నాయకత్వంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి,హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ జల్లేపల్లి వెంకటేశ్వర్లు,పట్టణ అధ్యక్షుడు కామిశెట్టి రవికుమార్ ఆధ్వర్యంలో పలువురు వైయస్సార్ తెలంగాణ పార్టీ హైదరాబాద్ కార్యాలయంలో మంగళవారం వైఎస్ షర్మిల,గట్టు రామచంద్రరావు సమక్షంలో నియోజకవర్గంలోని పలు మండలాలు, హుజూర్ నగర్ పట్టణం నుండి వైయస్సార్ తెలంగాణ పార్టీలో చేరారు.
ఈ కార్యక్రమంలో చింతలపాలెం మండల అధ్యక్షుడు ధనపాటి రాధా రెడ్డి,మఠంపల్లి మండల అధ్యక్షుడు బలుసుపాటి రవి,మేళ్లచెరువు మండల పార్టీ అధ్యక్షుడు సాముల సైదిరెడ్డి, ఖలీల్,లక్ష్మణ్,వేముల రాజు, మర్రి రవీందర్ రెడ్డి,సుతారి శ్రీనివాస్, కమలాకర్,రఫీ,డాన్ సైదా,మీరా,జడ సాయి,ఉపేందర్,సురేష్ ,బడే,జోజి తదితరలు పాల్గొన్నారు.
సత్యం న్యూస్,హుజూర్ నగర్