కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మంగళవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బూరుగడ్డ గ్రామంలో జరిగింది.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడు అరుణ్ కుమార్ దేశ్ ముఖ్, మండల అధ్యక్షుడు చక్ర వీరారెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో దేశంలో,రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోవడం హర్షదాయకమని,ఇదే రెట్టింపు ఉత్సాహంతో కార్యకర్తలు పనిచేయాలని కోరారు.కష్టించి పనిచేసిన ప్రతి కార్యకర్తకి తప్పక గుర్తింపు లభిస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ దొంగరి సత్యనారాయణ,కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు ప్రభాకర్,యరగాని బిక్షం గడ్డం నాగయ్య,బ్రహ్మం,అజ్మతుల్లా పార్టీ బూత్ రోలర్స్,పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్,హుజూర్ నగర్