27.7 C
Hyderabad
April 26, 2024 05: 37 AM
Slider ముఖ్యంశాలు

చెయ్యేరు బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం మోసం

అన్నమయ్య జిల్లా రాజంపేట లో పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ పట్ట భద్రుల ఎన్నికల సమీక్ష సమావేశంలో బుధవారం రాష్ట్ర బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజు పాల్గొన్నారు.రాజంపేట బి.జె.పి అసెంబ్లీ ఇంచార్జీ పోటుగుంట రమేష్ నాయుడు ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మూలంగా అమరావతి రైతులు రోడ్డు కెక్కారన్నారు.

అమరావతి కడతానని చంద్రబాబు నాయుడు,మూడు రాజ ధానులు పేరిట జగన్ మోహన్ రెడ్డి మోసం చేశారన్నారు.చెయ్యేరు డ్యామ్ వరద బాధితులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. డ్యామ్ అంచనాలు తప్ప, కట్టడాల ప్రయత్నాలు చేయడం లేదని ఆరోపించారు.కేంద్ర ప్రభుత్వం 11 హైవే కారిడార్ లు ప్రకటించగా,3 కారిడార్ లు ఏపీకి మంజూరు చేశారన్నారు.ఎపి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పతకాలను స్టిక్కర్ వేసుకొని తన పథకాలను ప్రచారం చేసుకొంటోందని ఎద్దేవా చేశారు.ఈ సమావేశంలో రాష్ట్ర యువ మోర్చా అధ్యక్షుడు రమేష్ నాయుడు,బిజెపి పొలిటికల్ ఫీడ్ బ్యాక్ కమిటీ మెంబర్ సాయిలోకేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

రాజ్ దాసిరెడ్డికి డబుల్ ధమాకా!!

Satyam NEWS

సర్వాయి పాపన్నకు ఘనంగా నివాళులు

Murali Krishna

వనపర్తి మున్సిపల్ చైర్మన్ గా  పుట్ట పాక మహేష్   

Satyam NEWS

Leave a Comment