27.7 C
Hyderabad
May 12, 2024 05: 43 AM
Slider ప్రత్యేకం

పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన ప్రజాప్రతినిధులు

#ponguleti

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పలువురు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఖమ్మంలోని పొంగులేటి క్యాంపు కార్యాలయంలో మండలంలోని కొక్కిరేణి ఎంపీటీసీ గుగ్గిళ్ళ అంబేద్కర్, మండల కోఆప్షన్ సభ్యుడు సైఫ్ఫుద్దిన్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బత్తుల రవికుమార్, బీఆర్ఎస్ నాయకులు రాజేంద్ర ప్రసాద్ , నగేష్ గౌడ్ ఇంకా మరి కొంతమంది బీ ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పొంగులేటి తన క్యాంప్ కార్యాలయంలో వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల జడ్పిటిసి బెల్లం శ్రీనివాస్, నరేష్ రెడ్డి చావా శివరామకృష్ణ, గండ్ర గోపాలరావు, మాజీ ఎంపీపీ అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

12న మినీ మహానాడు: నరసరావుపేటకు చంద్రబాబు రాక

Satyam NEWS

జాతీయ నాయకులకు అందరూ కనీస గౌరవం ఇవ్వాలి

Satyam NEWS

షర్మిల పార్టీలోకి వెళుతున్న సీనియర్ రెడ్లు

Satyam NEWS

Leave a Comment