రాజకీయ నాయకులు జాతీయ నాయకులకు కనీస గౌరవం ఇవ్వాలని సమైక్య ఆంధ్ర ప్రదేశ్ ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వీనర్ ఎస్.కె జిలాని మాలిక్ అన్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలోని పల్నాడు రోడ్డు లో టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఆదివారం నాడు మీట్ ది పబ్లిక్ కార్యక్రమం నిర్వహించారు. కృష్ణ నర్సింగ్ హోమ్ నుండి పాత చెక్ పోస్ట్ వరకు ఆ ప్రాంతంలోని వ్యాపారస్తులను, స్థానికులను కలవడం, ఆరోగ్యం బాగాలేని వారిని పరామర్శించడం, మరణించిన వారికి పూలమాలలు వేయడం చేశారని జిలాని మాలిక్ అన్నారు.
ఈ సందర్భంగా అక్కడ ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేయడం చేశారే గాని, అదే ప్రాంతంలో ఉన్న మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త భారత రత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించలేదని ఆయన అన్నారు. ఈ సంఘటన చూస్తుంటే నరసరావుపేట నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబుతో పాటు వారికి సలహాలు ఇచ్చే వారిని రాజకీయ అవగాహనా లేని వ్యక్తులు గా పరిగణించాల్సి వస్తుందని, లేదా జాతీయ నాయకుల పై వివక్షత చూపిస్తూన్నట్లు భావించాల్సి వస్తుందని ఆయన తెలిపారు.