Slider గుంటూరు

12న మినీ మహానాడు: నరసరావుపేటకు చంద్రబాబు రాక

#minimahanadu

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నరసరావుపేట పట్టణంలో సత్తెనపల్లి రోడ్డులో ఈనెల 12న మినీ మహానాడు జరిపేందుకు ఏర్పాట్లు ప్రారంభించారు. నరసరావుపేట మండలం ఇస్సాపాలెం పరిధిలోని రోడ్డు పక్కన ఉన్న 30 ఎకరాలకు పైగా వ్యవసాయ క్షేత్రంలో ఈ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు సమక్షంలో నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు,మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు,మాజీ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు తదితరులు నిర్ణయం తీసుకున్నారు.

నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు పర్యవేక్షణలో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రణాళికలు రచించారు. కాగా,చదలవాడ అరవింద బాబుతో పాటు వేములపల్లి వెంకట నరసయ్య, సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులు నాగోతు సౌరయ్య, నరసరావుపేట నియోజకవర్గ నాయకులు బండారుపల్లి విశ్వేశ్వరరావు, వెన్న బలకోటి రెడ్డి, కొల్లి బ్రహ్మయ్య, నల్లపాటి రాము, పూదోట సునీల్, కొట్ట కిరణ్, మాబు, కొవ్వూరి బాబు,వనమా శివ, గాడిపర్తి సురేష్,కుమ్మేత కోటి రెడ్డి తదితరులు ఆదివారం సభాస్థలిని పరిశీలించారు.

ఈ సందర్భంగా డా౹౹చదలవాడ మాట్లాడుతూ నరసరావుపేటలో ఈనెల 12న నిర్వహించే భారీ బహిరంగ సభలో వేలాదిగా ప్రజలు పాల్గొంటారని చెప్పారు. ప్రజలు స్వచ్ఛందంగా తరలిరానున్నారన్నారు. అలాగే,13న చిలకలూరిపేటలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల టీడీపీ నాయకులతో అధినేత సమావేశమవుతారన్నారు.

విజయవంతం చేయండి: ప్రత్తిపాటి,జి.వి

ఈ నెల 13న చిలకలూరిపేటలో టీడీపీ నాయకులు,కార్యకర్తలతో నిర్వహించనున్న సమావేశాన్ని విజయవంతం చేయాలని మాజీ మంత్రి,రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు కోరారు.మాజీ ఎమ్మెల్యే జీ.వీ.ఎస్ ఆంజనేయులు మాట్లాడుతూ చంద్రబాబు పర్యటనకు ప్రతి జిల్లాలోనూ మంచి స్పందన వస్తుందని అన్నారు.పల్నాడు జిల్లా ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరిగే సభను విజయవంతం చేయాలని కోరారు.

Related posts

పువ్వాడ ను పరామర్శించిన తమ్మినేని

Satyam NEWS

జోవాద్‌ ఎఫెక్ట్ ….నేడు రేపు ఏపీలో పరిస్థితి ఏమిటంటే….

Satyam NEWS

మంత్రి హత్య కుట్ర కాదు… ఇది ప్రశాంత్ కిషోర్ పన్నిన వ్యూహం

Satyam NEWS

Leave a Comment