ఉప్పల్ నియోజకవర్గంలోని ఈ ప్రాంతాన్ని చూస్తే మనం ఏ కాలంలో ఉన్నామా అనిపిస్తుంది. సారూ పట్టించుకోరూ..? అంటూ చక్రిపురం కాలనీలో పొంగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీని చూపిస్తూ స్థానికులు అడుగుతున్నారు. నాగార్జున నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎదురుగా పోచమ్మ గుడి దగ్గర చక్రిపురం కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వారానికోసారి
అన్నట్టుగా పొంగిపొర్లుతూ కంపు వాసన వస్తుంది. మురుగు దోమలు, కుక్కలు పందులకు ఆవాసంగా మారింది. పశువులు హాయిగా సేద తీరుతున్నాయి. జిహెచ్ఎంసి జలమండలి అధికారులు తక్షణమే స్పందించి మురుగు శుద్ధి చర్యలు చేపట్టాలని కోరుతున్నామని స్థానికులు అన్నారు.
సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా