సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం ఆదివారం అకస్మాత్తుగా క్షీణించింది. చాలా రోజులుగా అనారోగ్య కారణాలతో ఆయన గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యాన్ని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
సమాచారం మేరకు ఆయనను వైద్యులు మామూలుగది నుంచి ఐసీయూకు తరలించారు. తండ్రి అనారోగ్య వార్త తెలిసిన వెంటనే అఖిలేష్ యాదవ్ లక్నో నుంచి ఢిల్లీకి బయలుదేరారు. రెండో కుమారుడు ప్రతీక్ యాదవ్, తమ్ముడు శివపాల్ సింగ్ యాదవ్ ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు.
అదే సమయంలో కోడలు అర్పణ కూడా ఢిల్లీకి వెళ్లిపోయింది. మేదాంత సీనియర్ వైద్యుడు డాక్టర్ నరేష్ ట్రెహాన్ స్వయంగా ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు.