అయ్యప్ప స్వామి ఎక్కడో ఉండరని, మాలాధారణ చేసిన ప్రతి వ్యక్తిలోనూ ఉంటారని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో వలపి శెట్టి భాస్కర్ చేసిన భిక్ష మరియు పడిపూజ కార్యక్రమంలో షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ప్రతి గ్రామం అయ్యప్ప శరణు ఘోషతో ధర్మరాజ్యం కావాలని ఆకాంక్షించారు.
అయ్యప్ప అనే పేరులో కులం, మతం, ప్రాంతం, వర్ణన, వర్గం లేదన్నారు. మాలధారణ చేసిన వ్యక్తిని అతని భార్య కూడా అయ్యప్ప గానే చూస్తుందని, తల్లిదండ్రులు సైతం కాళ్లకు నమస్కారం చేస్తారని తెలిపారు. అయ్యప్ప దీక్షధారణ చేస్తే ఆ వ్యక్తిలోనే అయ్యప్పను దర్శించుకుంటారని పేర్కొన్నారు. ప్రపంచానికి అయ్యప్ప స్వామి శక్తిని చాటలన్నారు. శబరిమలకు వెళ్లడానికి ప్రభుత్వం ప్రత్యేక వసతులు కల్పించాలని, మాల ధారణ చేసిన వారికి ఉచిత బస్సు సర్వీస్ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, అయ్యప్ప అన్నప్రసాద సేవ సమితి అధ్యక్షులు గందె శ్రీనివాస్ గుప్తా, కూర శ్రీనివాస్, పంపరి లక్ష్మణ్, కృష్ణారెడ్డి స్వామి, యాద అంజయ్య తదితరులు పాల్గొన్నారు.