22.7 C
Hyderabad
February 14, 2025 01: 47 AM
Slider ఆధ్యాత్మికం

కరోనా ఎఫెక్ట్: షిర్డీ సాయి ఆలయం నిరవధికంగా మూసివేత

shird sai

మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో షిర్డీ సాయి ఆలయాన్ని నిరవధికంగా మూసివేయాలని నిర్ణయించారు. నేటి మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆలయం మూసివేయనున్నారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ ఆలయాన్ని తెరవ వద్దని కూడా ప్రభుత్వం ఆదేశించింది. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా దేశ వ్యాప్తంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.

దేశంలో అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదైన విషయం తెలిసిందే. ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు 39 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. భక్తుల తాకిడి అధికంగా ఉండే షిర్డీ ఆలయాన్ని మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు, తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ ఆలయాన్ని తెరవబోరని ప్రకటించారు. బాబా భక్తులు తమ ప్రయాణాలను తాత్కాలికంగా రద్దు చేసుకోవాలని చెప్పారు.

Related posts

ఉత్త‌రాంధ్ర‌లో ఎన్నిక‌ల క‌మీష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ప‌ర్య‌ట‌న‌

Satyam NEWS

మధు వాకిటి యు ట్యూబ్ కి ఉత్తమ పురస్కారం

Satyam NEWS

బాగ్ అంబ‌ర్ పేట్‌లో నూత‌న మ్యాన్ హోల్స్ నిర్మాణం

Sub Editor

Leave a Comment