29.7 C
Hyderabad
May 4, 2024 04: 05 AM
Slider ఆధ్యాత్మికం

కరోనా ఎఫెక్ట్: షిర్డీ సాయి ఆలయం నిరవధికంగా మూసివేత

shird sai

మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో షిర్డీ సాయి ఆలయాన్ని నిరవధికంగా మూసివేయాలని నిర్ణయించారు. నేటి మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆలయం మూసివేయనున్నారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ ఆలయాన్ని తెరవ వద్దని కూడా ప్రభుత్వం ఆదేశించింది. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా దేశ వ్యాప్తంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.

దేశంలో అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదైన విషయం తెలిసిందే. ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు 39 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. భక్తుల తాకిడి అధికంగా ఉండే షిర్డీ ఆలయాన్ని మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు, తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ ఆలయాన్ని తెరవబోరని ప్రకటించారు. బాబా భక్తులు తమ ప్రయాణాలను తాత్కాలికంగా రద్దు చేసుకోవాలని చెప్పారు.

Related posts

రఘురాముడికి ‘వై’ క్యాటగిరి రక్షణ కల్పించిన కేంద్రం

Satyam NEWS

టీడీపీ సంచలనం: సత్తెనపల్లి కి కన్నా

Satyam NEWS

గోదావరికి వరద సూచికతో అధికార యంత్రాంగం అప్రమత్తం

Satyam NEWS

Leave a Comment