దొంగిలించిన సొమ్ము తో ఉడాయించిన దొంగలు నిద్రపోయి పోలీసులకు చిక్కారు.చోరీ చేసిన సొత్తు తో తోవలో మద్యం తాగి తిరిగి వెళ్తూ మార్గమధ్యలోనే ఇక్కడ తమను ఎవరు గుర్తు పట్టరని దైర్యం తో నో లేకా మద్యం మత్తు లో నో నిద్రలోకి జారుకున్నారు ఇద్దరు దొంగలు. ముందుగా రెక్కీ నిర్వ హించి అర్థరాత్రి మున్సిపల్ కార్యాలయం లో ఎవరు ఉండరని తెలుసుకుని
సదరు దొంగలు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో చోరీకి పాల్పడ్డారు. నగర పంచాయతీ వాహనం, కంప్యూటర్ ఇతర సామాగ్రిని అపహరించిన దొంగలు తిరిగి వెళ్తూ కరీంనగర్ జిల్లా కురిక్యాలలో రోడ్డు పక్కన ఆగి నిద్రపోయారు. తెల్లవారుజామున నిద్ర లేచే సరికి కొందరు తమ చుట్టూ ముట్టి ప్రశ్నల వర్షం కురిపించగా వారు కళ్ళు తేలేసారు.ఆ గ్రామస్థులకు అనుమానం వచ్చి నిలదీయగా
వారు పొంతన లేని సమాధానమిచ్చారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు వేములవాడకు చెందిన నాగరాజు, ఠాగూర్గా గుర్తించి వారి నుంచి అపహరించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.