రామ్ తీర్థ ట్రస్ట్ వారి శోభాయాత్ర శివాజీ నాగలింగం ఆధ్వర్యంలో సత్యనారాయణపురం పురవీధుల్లో అత్యంత వైభవంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో బాలాజీ ప్రసాద్ గారి షిరిడి సాయి చిన్నారుల కోలాటం బృందం అద్భుత ప్రదర్శన అందరినీ అలరించింది.
అలాగే ఈ కార్యక్రమంలో బొగ్గవరపు సత్యనారాయణ, తంగిరాల రాఘవ శాస్త్రి పాల్గొన్నారు. పూజ్యశ్రీ శివ స్వామి పురవీధుల్లో పాదయాత్రలో పాల్గొని భారతదేశం గురించి శ్రీ రాముడి గొప్పతనం గురించి అయోధ్య రామమందిర నిర్మాణం విశేషాలు ప్రజలకు తెలియజేశారు.