విజయనగరం కోట జంక్షన్ వద్ద గల జీయర్ కాంప్లెక్స్ లో భారతీయ జనతాపార్టీ అసెంబ్లీ కార్యాలయంలో మన భారత ప్రధాని నరేందర్ మోడీ జీ జన్మదిన వేడుకలు సందర్భంగా భారతీయ జనతాపార్టీ యువమోర్చా అధ్యక్షులు కాళ్ళ నారాయణరావు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఘనంగా జన్మదిన వేడుకలు చేయడం జరిగింది. ఈ రక్తదానం కార్యక్రమంలో సుమారు 25 మంది బీజేపీ యువ మోర్చా నాయకులు, కార్యకర్తలు రక్త దానం చేయడం జరిగిందని కాళ్ళ నారాయణరావు అన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కుసుమంచి సుబ్బారావు మాట్లాడుతూ నరేంద్ర మోడీ జీ భారత ప్రధాని అయిన నుండి మన దేశాన్ని ప్రపంచంలో అత్యంత ఉన్నత స్థానంలో నిలపాలనే ధృఢ సంకల్పంతో పనిచేస్తున్నారన్నారు.అందులో భాగంగానే దేశ వ్యాప్తంగా రక్తం కొరత లేకుండా దేశ ప్రజలకు ఆరోగ్య వంతమైన రక్తం అందుబాటులో ఉండాలనే సదుద్దేశ్యంతో యువత రక్త దానం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సుమారు 24 మంది బిజెపి నేతలు రక్తం దానం చేశారు.
ఈ కార్యక్రమంలో నమామి గంగే కో-కన్వీనర్ శివ ప్రసాద్ రెడ్డి, బగ్గాం రాజేష్, నార్త్ జోన్ అధ్యక్షులు ఇమంది సుధీర్, కొండల శ్రీనివాస్, బొబ్బిలి శ్రీనివాస్, గిరిబాబు, కంది సీతారాం, సోము మహేష్, బూర జగ్గారావు, అబ్దుల్ ఆధిల్, పిల్లా నవీన్, కరాటే ఆనంద్, జమ్ము రాంబాబు, శంకర్, శ్రీదేవి, అప్పారావు దొరా పాల్గొన్నారు.