29.7 C
Hyderabad
May 4, 2024 03: 21 AM
Slider హైదరాబాద్

భారీ పోలీసు బందోబస్తు మధ్య ప్రారంభమైన శోభాయాత్ర

#mlarajasingh

ఆకాష్ పూరి హనుమాన్ మందిర్ ప్రత్యేక పూజలు అనంతరం రాణి అవంతి భాయ్ భవనం నుండి శ్రీరామ్ యువసేన ఆధ్వర్యంలో గోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్ భారీ విశాల్ శోభయాత్రను ఘనంగా ప్రారంభించారు. పెద్ద ఎత్తున యువకులు, రామ భక్తులు, మహిళలు రాణి అవంతి భాయ్ భవనం చేరుకొని రాజాసింగ్ శోభయాత్రలో పాల్గొన్నారు. వేల సంఖ్యలో రాజాసింగ్ అభిమానులు, రామ భక్తులు పెద్ద ఎత్తున కాషాయ జండాలు పట్టుకొని జై శ్రీరామ్ అనే నినాదాలు చేస్తూ శోభయాత్ర ముందుకు కదిలింది. భారీ పోలీసుల బలగాలతో శోభయాత్ర ఆధ్యాత్మిక వాతావరణం లో ముందుకు సాగుతోంది. ధూల్ పేట్,  మంగళహాట్, పురానాపూల్ గాంధీ విగ్రహం ప్రాంతాలలో రామభక్తులతో కిక్కిరిసిపోయింది. ఈ శోభయాత్రలో నగర పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ శోభయాత్ర ముందు ఉండి నడిపిస్తున్నారు.

Related posts

కాపీ క్యాట్: 2 వేల నోటుపై సెక్యూరిటీ ఫీచర్లు డొల్లే

Satyam NEWS

శ్రేయోభిలాషులకు జ్ఞానదీప్తి తండ్రి కృతజ్ఞతలు

Satyam NEWS

ఉపాధి హామీ లో రెండు పూటల పని రద్దుచేయాలి

Satyam NEWS

Leave a Comment