38.2 C
Hyderabad
April 27, 2024 18: 56 PM
Slider మహబూబ్ నగర్

గౌడ సంఘం సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది

government is committed

గౌడ సంఘం సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందనీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో రాష్ట్ర గౌడ సంఘం కన్వినర్ పలుస రమేష్ గౌడ్,రాష్ట్ర కో – కన్వినర్ సురేష్ గౌడ్,జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు బండారు శ్రీనివాస్ గౌడ్,జిల్లా నాయకులు పలుస కృపానంద్ గౌడ్,కౌన్సిలర్ సుధా మధు సుధన్ గౌడ్,లక్ష్మి దేవమ్మ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నీ కలిసి శ్రీరామ నవమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్బంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో భాగంగా గౌడ సంక్షేమం కోసం వరాల జల్లు కురించారు.వనపర్తి జిల్లా గౌడ సంఘం నాయకులకు విజ్ఞప్తి మేరకు జిల్లా కేంద్రంలోని పాన్ గల్ వెళ్లే రోడ్డులో నీ గౌడ ఉద్యోగుల,విశ్రాంత ఉద్యోగుల, ప్రొఫెషనల్ సంఘం కమ్యూనిటీ భవన నిర్మాణం కు 25 లక్షల రూపాయలు మంజూరు చేస్తామని,గౌడ కుల దేవత ఎల్లమ్మ దేవాలయ నిర్మాణం,జిల్లా లోని పేద గౌడ విద్యార్థుల కోసం వసతి గృహం నిర్మాణం కు రెండు ఎకరాల భూమిని,త్వరలో జిల్లా కేంద్రంలోని సర్వాయి సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహం ప్రతిష్టా కు అనువైన స్థలం,ఆర్థిక సహాయం కేటాయిస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా జిల్లా గౌడ సంఘం నాయకులు 200 మంది గౌడ కులస్తులతో కలిసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డినిసన్మానించి,కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షులు జామ శ్రీనివాస్ గౌడ్,కార్యదర్శి పార్థ సారధి గౌడ్, ఉద్యోగ సంఘం నాయకులు మనోహర్ గౌడ్,కృష్ణ గౌడ్,డి.

ఆర్ గౌడ్,వెంకటేష్ గౌడ్,ఎలక్ట్రిసిటీ ఏఈ రాజా గౌడ్,ఉపాధ్యాయులు రవీందర్ గౌడ్,మేఘా శ్యామ్ గౌడ్,రవీందర్ గౌడ్,నాగేంద్రం గౌడ్,నాగరాజు గౌడ్,ఈశ్వరయ్య గౌడ్,శ్రీనివాస్ గౌడ్,సురేందర్ గౌడ్,భాస్కర్ గౌడ్,రామన్ గౌడ్, వనపర్తి గీత కార్మిక పారిశ్రామిక సంఘం అధ్యక్షులు రామస్వామి గౌడ్,రామన్ గౌడ్,వెంకటయ్య గౌడ్, పురుషోత్తం గౌడ్,వామన్ గౌడ్,నరేందర్ గౌడ్,వినోద్ గౌడ్,మురళీధర్ గౌడ్,రాజేందర్ గౌడ్,శివన్న గౌడ్,కృష్ణ గౌడ్,రమేష్ గౌడ్, గౌడ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు పలుస శ్రీకర్ గౌడ్,నాయకులు పలుస రాఘవేందర్ గౌడ్,రాజేష్ గౌడ్,అనీల్ గౌడ్,కార్తీక్ గౌడ్,పీపీ గౌడ్ పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

ఈనాడు దినపత్రిక కథనం కల్పితం

Satyam NEWS

దేశంలో 24గంటలు కరెంటు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ

Satyam NEWS

‘చెత్త ఇండియా’ వ్యాఖ్యలకు జో బైడెన్ గట్టి కౌంటర్

Satyam NEWS

Leave a Comment