37.2 C
Hyderabad
May 6, 2024 20: 53 PM
Slider హైదరాబాద్

ఇండిస్ వన్ సిటీ గేటెడ్ కమ్యూనిటీ హాల్ లో శ్రీరాముని శోభయాత్ర

#sobhayatra

కూకట్ పల్లి  నియోజకవర్గంలో ఎక్కడ చూసినా వాడవాడనా శ్రీరామ నామజపంతో ప్రజలందరూ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా కేపీ.హెచ్.బి కాలనీలోని ఇండస్ వన్ సిటీ గేటెడ్ కమ్యూనిటీలో రేపు జరగబోయే అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో నేడు గేటెడ్ కమ్యూనిటీలో చిన్న పిల్లలు తో కలిసి శ్రీరామ సీతా లక్ష్మణ,హనుమాన్ విగ్రహాలను చేతబుని కన్నుల పండుగగా శోభాయాత్రను నిర్వహించారు. అనంతరం పిల్లలతో వినూత్న కార్యక్రమాలకు స్వీకారం చుట్టారు.

రేపు జరగబోయే రాములవారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని గేటెడ్ కమ్యూనిటీ లో ఉన్న ప్రతి ఒక్కరూ చూసే విధంగా ప్రత్యేక స్క్రీన్ లను ఏర్పాటు చేస్తున్నట్లు కమ్యూనిటీ నిర్వాహకులు వెల్లడించారు. 500 ఏళ్ల కల రేపటితో నెరవేరనుందని ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాములవారి ప్రాణా ప్రతిష్ట కార్యక్రమం భారతదేశ వ్యాప్తంగా చూసేందుకు అందరూ సిద్ధంగా ఉన్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో అడ్వకేట్ హరి కిషన్, ఆనంద్ కుమార్, నారాయణ్ దాస్, ప్రీతం రెడ్డి, చంద్రశేఖర్, అడ్వకేట్ అంజలి, సుధాకర్, నీత్, గుప్తా, మీనా, తిమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

షేమ్ ఆన్ యు: మంత్రి సమావేశంలో లో పాత్రికేయుల పాట్లు

Satyam NEWS

హైదరాబాద్ లో వరద నివారణకు మాన్సూన్ ఏమర్జెన్సీ బృందాలు

Satyam NEWS

9ఏళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్

Bhavani

Leave a Comment