ముఖానికి మాస్క్ ధరించి, సామాజిక దూరం పాటిస్తూ తమను తాము కాపాడుకోవాలని గుంటూరు జిల్లా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జి ప్రముఖ వైద్యుడు డాక్టర్ చదలవాడ అరవింద బాబు తెలిపారు.
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా నేడు ఆయన కూరగాయల మార్కెట్, కిరాణా షాపులను పరిశీలించారు. అక్కడ ఇచ్చిన మార్కింగ్ లో మాత్రమే ప్రజలు నిలుచుని అవసరమైన వాటిని కొనుగోలు చేయాలని ఆయన సూచించారు.
ఎవరు అపోహలకు పోవద్దని, నరసరావుపేట నియోజకవర్గంలో ప్రాంతంలో ఇప్పటివరకు ఒక్క కరోనా పాజిటీవ్ కేస్ కూడా నమోదు కాలేదని ఆయన తెలిపారు. కాబట్టి అందరూ స్వీయ దిగ్బంధంలో ఉండి ఎవరిని వారు రక్షించుకుంటే, సమాజాన్ని రక్షించిన వారు అవుతారని ఆయన చెప్పారు.
ప్రభుత్వం ఆదేశానుసారం నియోజకవర్గంలోని ప్రజలందరూ లాక్ డౌన్ పాటిస్తూ ప్రతి ఒక్కరు ఇంటి నుండి బయటకు రాకుండా వైద్యులు సూచనలు పాటించాలని ఆయన కోరారు.