కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వం పలు రకాల ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా బిచ్కుంద మండల కేంద్రంలో ఆటోను ప్రచార రథం లా తయారు చేసి పుర వీధుల్లో తిప్పుతూ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ మైకును ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమాన్ని తహసీల్దార్ వెంకట్రావు శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి అశోక్ పటేల్, ఎస్సై కృష్ణ, ఎంపిడిఓ ఆనంద్, గ్రామ సర్పంచ్ శ్రీరేఖ రాజు, ఆరోగ్య బోధకులు దస్థిరం, గ్రామ రెవెన్యూ అధికారి శ్రీహర్ష ఆశా కార్యకర్తలు ఉన్నారు.