సోమశిల మునక ప్రాంతం పొత్తపి లో సోమశిల అధికారులను మునక వాసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఉద్రిక్తత నెలకొంది.
అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. కడప జిల్లా నందలూరు మండలం సోమశిల మునక ప్రాంతం సోమవారం రెండు వర్గాల మధ్య పొత్తపిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సోమశిల ప్రాజెక్టు అధికారులు జె.యి,డి యి లను సోమశిల మునక ప్రాంత వాసులు అడ్డుకున్నారు.
సోమశిల మునక ప్రాంతం ఆయిన పొత్తపిలో మునక పరిహారం చెల్లింపులో భాగంగా అధికారులు ముందుగా ఇండ్లకు పరిహారం చెల్లించేందుకు నెంబర్లు వేసేందుకు తరలి వచ్చారు.ఇండ్ల కంటే ముందు పొలాలకు నష్ట పరిహారం ఇవ్వాలని అధికారుల తో ఒక్క వర్గం వారు వాగ్వివాదం కు దిగారు.
మరో వర్గం వారు ముందుగా ఇండ్లకు ఇవ్వాలని వాగ్వాదానికి దిగారు. దీనితో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అధికారులు వెను దిరిగి వెళ్లి పోయారు.