32.7 C
Hyderabad
April 27, 2024 03: 00 AM
Slider నిజామాబాద్

కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళి అర్పించిన నేతలు

#kondalaxmanbapujee

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి పురస్కరించుకొని బిచ్కుంద ఎంపీపీ అశోక్ పటేల్ ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఎంపీపీ అశోక్ పటేల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన తొలితరం ఉద్యమకారులు న్యాయవాది రాజకీయాలకు వన్నె తెచ్చిన మహా నాయకుడు అని 97 సంవత్సరాల వయస్సులో ప్రత్యేక రాష్ట్రం కోసం దీక్ష చేపట్టిన ఘనత ఆయనకే దక్కిందన్నారు.

ఆయనను స్ఫూర్తిదాయకంగా తీసుకొని ప్రతి ఒక్కరు నడవాలని ఎంపీపీ సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ మల్లికార్జున్ పటేల్, పార్టీ మండల అధ్యక్షులు వెంకట్రావు దేశాయ్, మాజీ ఏఎంసీ చైర్మన్ రాజు, రైతు సహకార సంఘం ఉపాధ్యక్షులు యాదవ్ రావు, సర్పంచ్ ఆకులసాయిలు, మాజీ సర్పంచులు సంజు పటేల్, ఖథ్ఖాం హనుమాన్లు, నాయకులు రామ్ చందర్, గణేష్ గోండా‌, డాక్టర్ రాజు, బొమ్మల లక్ష్మణ్, అవార్ శ్రీనివాస్, సుదర్శన్, నాయకులు ఉన్నారు.

జి.లాలయ్య, సత్యం న్యూస్ రిపోర్టర్, జుక్కల్

Related posts

రోడ్ సేఫ్టీ మీటింగ్: ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి…!

Bhavani

నో సింపతీ: అంకిత భావం అభివృద్ధిని చూసి ఓటెయ్యండి

Satyam NEWS

సెరిమోనియల్ పరేడ్ లో భావోద్వేగానికి గురైన డీఐజీ రాజ‌కుమారీ….!

Satyam NEWS

Leave a Comment