ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడుగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు నియమితులయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు.
వీర్రాజు నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం బిజెపి ఏపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ ఉన్నారు. ఆయన పదవి కాలం పూర్తి కావడంతో కొత్త అధ్యక్షుడి నియామకం అనివార్యం అయింది.