కరోనా నేపథ్యంలో స్టీల్ ప్లేట్ లో భోజనం చేయడానికి నగర వాసులు భయపడుతున్నారు. నగరంలోని హోటళ్లలో పేపర్ ప్లేట్లలో వినియోగదారులకు భోజనాన్ని అందించాల్సి ఉంది. అయితే అయితే ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని బావర్చి బిర్యానీ హోటల్ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా స్టీల్ ప్లేట్లలో నే బిర్యాని వడ్డిస్తుంది.
ఈ విషయమై వినియోగదారులు ఎవరైనా ప్రశ్నిస్తే యజమాన్యం సిబ్బంది వారిపై దాడులకు తెగ బడు తున్నారు. స్టీల్ ప్లేట్ లో తింటే తినండి లేకపోతే లేదంటూ వారిపై దౌర్జన్యానికి పాల్పడుతోంది. సోమవారం మధ్యాహ్నం ఇలాంటి సంఘటన బావర్చి హోటల్ లో చోటుచేసుకుంది.