తలుచుకుంటేనే భయంగా ఉంది. రాయాలంటేనే భయంగా ఉంది. ఈ రెండు ఫొటోలు చూశారుగా? ఈ ఫొటోలలో ఉన్నది హైదరాబాద్ కు చెందిన మీడియా ప్రతినిధులు. ఫొటో జర్నలిస్టులు. సచివాలయం కూల్చివేత సమయంలో విలేకరులను, ఫొటోగ్రాఫర్లను అనుమతించకపోవడంపై రాష్ట్ర హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది.
ఆ సందర్భంగా వీడియో, ఫొటో జర్నలిస్టులను కూల్చివేత పనులు చూపిస్తామని ప్రభుత్వం చెప్పింది. దానికి అనుగుణంగా సోమవారంనాడు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఫొటో జర్నలిస్టులను జీహెచ్ఎంసి వాహనంలో కుక్కేశారు. లెక్కకు మించి ఎక్కించారు. ఓపెన్ టాప్ జీపులో కూడా అంతే.
హడావుడిగా పోలీసులు బందోబస్తు మధ్య కూల్చివేతల స్థలానికి తీసుకెళ్లారు. అంతా జనం కిక్కిరిసి ఉన్నారు. కొందరి నోటికి మాస్కులు ఉన్నాయి. ఎవరికి చేతికి గ్లౌజెస్ లేవు. భౌతిక దూరం అంతకన్నాలేదు. ఇది కరోనా కాలమని పోలీసులు, మునిసిపాలిటీవారు, ఉన్నతాధికారులు అందరూ మర్చిపోయారు.
ఈ సమూహంలో ఏ ఒక్కరికి కరోనా ఉన్నా…………. తలుచుకుంటేనే భయంగా ఉంది. రాయాలంటేనే భయంగా ఉంది.