దేశంలో రోజు రోజుకు కరోనా ఒమిక్రాన్ రూపంలో చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అదే విధంగా 55 రైళ్ల రద్దును ఈనెల 31 వరకు పొడిగించినట్లు వెల్లడించింది.
రద్దు చేసిన ప్రధాన రైళ్లు ఇవే..
కాజీపేట-సికింద్రాబాద్, కాచిగూడ-నడికుడ ప్యాసింజర్ రైళ్లు
కాచిగూడ-కర్నూల్ సిటీ, మేడ్చల్-ఉందానగర్ రైళ్లు రద్దు
మేడ్చల్ -సికింద్రాబాద్, సికింద్రాబాద్-ఉందానగర్ రైళ్లు రద్దు
తిరుపతి-కట్పడి, గుంతకల్-డోన్, కర్నూల్ సిటీ-గుంతకల్లు రైళ్లు రద్దు
రేపల్లె-తెనాలి, విజయవాడ-నర్సాపూర్ ప్యాసింజర్ రైళ్లు రద్దు
మచిలీపట్నం-విజయవాడ, మచిలీపట్నం-గుడివాడ రైళ్లు రద్దు
నర్సాపూర్-నిడుదవోలు ప్యాసింజర్ రైలు రద్దు
ఎంఎంటీఎస్లు రద్దు
అదే విధంగా హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ సర్వీసుల రద్దు కొనసాగుతోంది. ఈ నెల 23 వరకూ 38 సర్వీసులను రద్దు చేసిన ద.మ. రైల్వే.. 24వ తేదీ కూడా 36 సర్వీసులను నిలిపేసినట్లు ప్రకటించింది. ఇందులో హైదరాబాద్ – లింగంపల్లి మధ్య నడిచే 18, ఫలక్నుమా – లింగంపల్లి మధ్య నడిచే 16, సికింద్రాబాద్ – లింగంపల్లి మధ్య నడిచే రెండు ఎంఎంటీఎస్లు ఉన్నాయి.