25.2 C
Hyderabad
May 13, 2024 07: 54 AM
Slider ప్రత్యేకం

ఒమిక్రాన్ నేపథ్యంలో రైళ్లు రద్దు చేసిన దక్షిణమధ్య రైల్వే

#IndianRailways

దేశంలో రోజు రోజుకు కరోనా ఒమిక్రాన్ రూపంలో చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అదే విధంగా 55 రైళ్ల రద్దును ఈనెల 31 వరకు పొడిగించినట్లు వెల్లడించింది.

రద్దు చేసిన ప్రధాన రైళ్లు ఇవే..

కాజీపేట-సికింద్రాబాద్, కాచిగూడ-నడికుడ ప్యాసింజర్‌ రైళ్లు

కాచిగూడ-కర్నూల్ సిటీ, మేడ్చల్‌-ఉందానగర్ రైళ్లు రద్దు

మేడ్చల్ -సికింద్రాబాద్, సికింద్రాబాద్-ఉందానగర్ రైళ్లు రద్దు

తిరుపతి-కట్‌పడి, గుంతకల్-డోన్, కర్నూల్ సిటీ-గుంతకల్లు రైళ్లు రద్దు

రేపల్లె-తెనాలి, విజయవాడ-నర్సాపూర్ ప్యాసింజర్‌ రైళ్లు రద్దు

మచిలీపట్నం-విజయవాడ, మచిలీపట్నం-గుడివాడ రైళ్లు రద్దు

నర్సాపూర్-నిడుదవోలు ప్యాసింజర్ రైలు రద్దు

ఎంఎంటీఎస్‌లు రద్దు

అదే విధంగా హైదరాబాద్ లో ఎంఎంటీఎస్‌ సర్వీసుల రద్దు కొనసాగుతోంది. ఈ నెల 23 వరకూ 38 సర్వీసులను రద్దు చేసిన ద.మ. రైల్వే.. 24వ తేదీ కూడా 36 సర్వీసులను నిలిపేసినట్లు ప్రకటించింది. ఇందులో హైదరాబాద్‌ – లింగంపల్లి మధ్య నడిచే 18, ఫలక్‌నుమా – లింగంపల్లి మధ్య నడిచే 16, సికింద్రాబాద్‌ – లింగంపల్లి మధ్య నడిచే రెండు ఎంఎంటీఎస్‌లు ఉన్నాయి.

Related posts

ఆస్ట్రేలియా టైటాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ పెస్టివ‌ల్‌లో ‘దహిణి’

Bhavani

రైతు వ్యతిరేక బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలి

Satyam NEWS

మత్తుపదార్ధాల సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలి

Satyam NEWS

Leave a Comment