అన్నమయ్య జిల్లా నందలూరులోని శ్రీ భూదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాధస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శనివారం నాలుగో రోజు మాడ వీధుల్లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాధ స్వామి విహరించారు. శనివారం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు.
స్వామివారిని దేవేరులను వివిధ రకాలపూలతో పట్టువస్త్రాలతో స్వర్ణాభరణాలతో నేత్రపర్వంగా అలంకరించారు. మంగళ వాయిద్యాల నడుమ,భక్తుల గోవిందనామాల మధ్య ఈ గ్రామోత్సవ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు నారికేళం,పండ్లు సమర్పించారు.
పాల్గొన్న భక్తులకు ఆలయంలో తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాద వితరణ గావించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వేదికపై ఆలపించిన అన్నమయ్య సంకీర్తన భక్తులను ఆకట్టు కున్నాయి.ఈ కార్యక్రమంలో ఆలయ బ్రహ్మోత్సవ కమిటీ గౌరవాధ్యక్షులు మేడా విజయ భాస్కర్ రెడ్డి, సమన్వయ కర్త మేడా విజయ శేఖర్ రెడ్డి,ఆలయ చైర్మన్ అరిగెల సౌమిత్రి చంద్రనాథ్,ఈవో కొండారెడ్డి, శేషారెడ్డి, ఆలయ అర్చకులు సునీల్ శర్మ, బాల సుబ్రమణ్యం స్వామి తదితరులు పాల్గొన్నారు.