28.7 C
Hyderabad
May 6, 2024 08: 06 AM
Slider ఆధ్యాత్మికం

వేడుకగా శ్రీ భూదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాధ స్వామి పల్లకి సేవ

#swomyanathaswamy

అన్నమయ్య జిల్లా నందలూరులోని శ్రీ భూదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాధస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శనివారం నాలుగో రోజు మాడ వీధుల్లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాధ స్వామి విహరించారు. శనివారం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు.

స్వామివారిని దేవేరులను వివిధ రకాలపూలతో పట్టువస్త్రాలతో స్వర్ణాభరణాలతో నేత్రపర్వంగా అలంకరించారు. మంగళ వాయిద్యాల నడుమ,భక్తుల గోవిందనామాల మధ్య ఈ గ్రామోత్సవ కార్యక్రమంలో  పెద్ద సంఖ్యలో భక్తులు నారికేళం,పండ్లు సమర్పించారు.

పాల్గొన్న భక్తులకు ఆలయంలో  తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాద వితరణ గావించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వేదికపై ఆలపించిన అన్నమయ్య సంకీర్తన  భక్తులను ఆకట్టు కున్నాయి.ఈ కార్యక్రమంలో ఆలయ బ్రహ్మోత్సవ కమిటీ  గౌరవాధ్యక్షులు మేడా విజయ భాస్కర్ రెడ్డి, సమన్వయ కర్త మేడా విజయ శేఖర్ రెడ్డి,ఆలయ చైర్మన్ అరిగెల సౌమిత్రి చంద్రనాథ్,ఈవో కొండారెడ్డి, శేషారెడ్డి, ఆలయ అర్చకులు సునీల్ శర్మ, బాల సుబ్రమణ్యం స్వామి తదితరులు పాల్గొన్నారు.

Related posts

త్వరలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

Satyam NEWS

కరోనా నిర్మూలన సేవాకార్యక్రమాలలో ఉప్పల ట్రస్ట్

Satyam NEWS

ట్రాఫిక్ ఆంక్షలు

Murali Krishna

Leave a Comment