దిశ డీఐజీగా విజయవాడకు బదిలీపై వెళిపోతున్న విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారీ తన చివరి అధికార కార్యక్రమం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు.
తన వెన్నంటే ఉండీ…అటు శాఖకు ఇటు తనకు వెన్నుముక లా ఉంటూ ప్రజలకు,పోలీసులకు మద్య వారధిలా నిలచిన పౌర సంబంధాల శాఖ సిబ్బందిని అభినందించడం.
సాయంత్రం జిల్లా పోలీస్ శాఖ తనకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతుందని తెలుసుకున్న ఎస్పీ… ఆ కార్యక్రమం ప్రారంభం అయ్యే లోగా పోలీస్ శాఖ లో పబ్లిక్ రిలేషన్స్ చూస్తున్న శాఖ సిబ్బందిని అభినందించాలని ఎస్పీ రాజకుమారీ నిర్ణయించుకున్నారు.
ఆదివారం ఉదయమే అంటే ఈ నెల 11 వ తేదీన డీపీఓకు వచ్చి పోలీస్ పీఆర్ అంటే పౌర సంబంధాలు చూస్తున్న ఆ విభాగపు చీఫ్ కోటేశ్వరరావును స్వయంగా తన ఛాంబర్ కు పిలిపించుకున్న ఎస్పీ రాజకుమారీ…ప్రశంసా పత్రం ఇచ్చి అభినందించారు.
అలాగే ఆ విబాగపు సిబ్బందితో సెరిమోనియల్ పరేడ్ రోజు ఫోటో కూడా తీయించుకున్నారు. పీఆర్ వో కోటేశ్వరరావుతోపాటు మరో సిబ్బంది రాముకు కూడా ఎస్పీ ప్రశంసాపత్రం ఇచ్చారు.