అమరావతి పరిరక్షణ యాత్రలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు అనంతపురం జిల్లాలో పర్యటించారు. కొడికొండ చెక్పోస్టు, పెనుకొండలో పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చంద్రబాబు జోలె పట్టి విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సహా ఇతర పార్టీల నేతలు హాజరయ్యారు. పెద్ద ఎత్తున తెదేపా నేతలు, కార్యకర్తలు పెనుకొండ చేరుకుని చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. పెనుకొండలోని అంబేడ్కర్ కూడలి బహిరంగ సభలో చంద్రబాబుతో పాటు ఐకాస నేతలు ప్రసంగించారు.
previous post