విజయనగరం జిల్లాలో ఈ నెల 25న రాష్ట్ర సీఎం జగన్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మెంటాడ మండలం పెద మేడపల్లి గ్రామంలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ నిర్మాణ పనులకు శంఖు స్థాపన కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో సభా స్థలం, శంఖు స్థాపన జరిగే ప్రాంతం, హెలిప్యాడ్, రూట్ బందోబస్తు, కాన్వాయ్, ట్రాఫిక్ రెగ్యులేషన్, రూఫ్ టాప్, వాహనాల మళ్లింపు, పార్కింగ్ వద్ద భద్రత ఏర్పాట్లను జిల్లా ఎస్పీ ఎం.దీపిక స్వయంగా పర్యవేక్షించారు. బందోబస్తు విధులు నిర్వహించే పోలీసు అధికారులు, సిబ్బందికి వారు నిర్వహించే విధులుపైన, చేపట్టాల్సిన భద్రత చర్యలపై పలు సూచనలు చేశారు. జిల్లా ఎస్పీ వెంట అదనపు ఎస్పీలు అస్మా ఫర్హీన్, అనిల్ పులిపాటి, మణికంఠ, పలువురు డీఎస్పీలు, సిఐలు, ఎసైలు సిబ్బంది పాల్గొన్నారు.
previous post