రానున్న వర్షాకాలంలో బస్తీలలో సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశం ఉన్నందున పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం కోసం జూన్ 1 నుంచి 8 వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని నల్లకుంట కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవి రమేష్ పేర్కొన్నారు.
మున్సిపల్ శాఖ మంత్రి కే టీ ఆర్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశాలు ఇచ్చారని, ఆ మేరకు వారం రోజులు శానిటేషన్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. నల్లకుంట డివిజన్ లోని కోరంటి ఫీవర్ హాస్పిటల్ చౌరస్తా నుండి ఓయూ గేట్ వరకు పట్టణ ప్రగతి సమగ్ర పరిశుభ్రత కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఈ వారం రోజుల్లో డివిజన్లో ఎక్కడ కూడా చెత్త చెదారం లేకుండా,మురికి గుంతలు లేకుండా శానిటేషన్ సిబ్బంది తో కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.
కాలనీ వాసులు, అపార్ట్ మెంట్స్ అసోసియేషన్ అందరూ సహకరించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసి శానిటేషన్ SFA, జవాన్లు వాసుదేవరెడ్డి, ఎల్లేష్, బాబురావు, సురేష్, శ్రీనివాస్, యాదగిరి మరియు శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.