కరోనా వైరస్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, సహాయక చర్యల కోసం తమవంతు సాయంగా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని చింతలపాలెం మండలం దొండపాడు గ్రామంలోని జువారి సిమెంట్స్ యాజమాన్యం ముఖ్యమంత్రి సహాయ నిధికి 20 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించింది.
దానికి సంబంధించిన చెక్కును జువారి సిమెంట్స్ ప్రతినిధులు, హుజుర్ నగర్ నియోజకవర్గ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకి అందించారు.